Skip to main content

అసలు యజమాని ఎవరు?



ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల
గురించి విని ఆయనని చూడాలని ఒక
రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని
వైపు బయలుదేరాడు.
దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు.
సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.
సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని
గుర్రం యెక్కించి తను నడవ సాగాడు.
రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి
ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు.
సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా
చుట్టూర పది మంది చేరారు.
కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ
రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు.
సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని,
సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.
ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి
న్యాయంకోసం వచ్చారు.
అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు.
బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని
ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి
రమ్మన్నాడు.
తెల్లవారింది.

ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని
గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ
గుర్రం తీసుకో”, అన్నాడు.
అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన
గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.
అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని
గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని
చూసి సంతోశంగా సెకిలించింది.
వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి
అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి
నివేదించాడు.
సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి
బీర్బల్ని ప్రశంసించి మళ్ళి తన రాజ్యానికి
బయలుదేరాడు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.