Skip to main content

సులభ మార్గం

గోదావరి తీరాన పూర్వం విశ్వనాధుడనే పండితుడి
గురుకులం వుండేది. ఆ గురుకులంలో
విద్యార్ధులకు వేదాలు, ఉపనిషత్తులు,
ఇతిహాసాలు, సాహిత్యం.... ఇలా వివిధ
అంశాలు నేర్పేవారు. అందులో చేరే
బాలలు పదేల్లపాటు విద్యనభ్యసించాలి.
ఒక ఏడాది శ్రీనివాసుడనే విద్యార్ధి
విద్యాభ్యాసం కోసం గురుకులం లో చేరాడు.
ఇంట్లో గారాభంగా పెరగడం వల్ల శ్రీనివాసుడికి
ఆశ్రమంలో నియమాలు కష్టంగా తోచేవి.
తెల్లవారుజామున అయిదు గంటలకు లేచి
పాఠాలు వల్లెవేయాలంటే అతడికి నరకప్రాయంగా
ఉండేది. పదేల్లపాటు అలా చదవడం తనవల్ల అయ్యే
పని కాదనుకుని ఒకసారి విశ్వనాధుడి దగ్గరకు వెళ్ళి గురువుగారూ మీరు గొప్ప పండితుడని అంతా చెబుతారు మరి సులభంగా చదువు నేర్పే
మంత్రం ఏదైనా కనిపెట్టలేరా అని ప్రశ్నించాడు.
విశ్వనాధుడు అతణ్ణి క్షణకాలం పరీక్షగా చూసి
సరస్వతీదేవి అనుగ్రహం పొందాలంటే ఒక
మంత్రం ఉంది అన్నాడు. అయితే ఆ
మంత్రం నాకు ఉపదేశించండి అని
అడిగాడు శ్రీనివాసుడు.


విశ్వనాధుడు చిన్నగా నవ్వి
అలాగే ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని
ప్రతిరోజూ తెల్లవారుజామున
నాలుగు గంటలకు లేచి. చన్నీటి స్నానం చేసి
జపించాలి అలా పద్నాలుగేళ్ళు చేస్తే సరస్వతీదేవి కోరిన విద్యలను అనుగ్రహిస్తుంది. రేపు ఉదయాన్నే
నాలుగు గంటలకు స్నానం చేసి వస్తే ఆ
మంత్రాన్ని ఉపదేసిస్తాను అన్నాడు.
ఆ సమాధానానికి
శ్రీనివాసుడు బెదిరిపోయి గురువుకి నమస్కరించి
నాకు ఏ మంత్రమూ వద్దు గురువుగారూ అందరిలానే కష్టపడి విద్యను అభ్యసిస్తాను అని చెప్పి ఆ రొజు నుంచీ బుద్దిగా చదువుకొసాగాడు.

Comments

Popular posts from this blog

ఆవు - పులి

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసిం